నూతన సంవత్సరం వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూయజమానులకు శుభవార్త ప్రకటించింది. గతం నుండి 22ఏ నిషేధ జాబితాలో ఉండి వచ్చిన భూముల విముక్తి కోసం యజమానులు ఎదురు చూస్తున్న పరిస్థితిని ప్రభుత్వం ఇప్పుడు పరిష్కరించింది. అనేక చర్చల తర్వాత ఈ భూముల విషయంలో కీలక నిర్ణయం తీసుకోవడమే ఈ చర్య.ప్రభుత్వం ఐదు రకాల భూములను 22ఏ జాబితా నుంచి తొలగించేందుకు నిర్ణయించుకుంది. మిగతా భూముల విషయంలో కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ ఐదు రకాల భూములపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలు అందించారు.రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సంతకం చేసిన ఈ నిర్ణయం ప్రకారం ప్రైవేట్ భూములను 22ఏ జాబితా నుంచి పూర్తిగా తొలగించనున్నారు. ప్రైవేట్ పట్టా భూముల యజమానులు దరఖాస్తు చేసుకున్నా, అధికారులు సుమోటోగా వీటిని జాబితా నుండి తొలగించాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుత మరియు మాజీ సైనికుల భూములకు సంబంధించిన పత్రాలు ఉంటే వీటిని కూడా జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. స్వాతంత్ర్య సమర యోధుల భూములు, రాజకీయ బాధితుల కేటాయించిన భూములు కూడా 22ఏ నుంచి తొలగించబడతాయి. భూ కేటాయింపుల కోసం జిల్లా సైనిక సంక్షేమ అధికారి చేసిన సిఫార్సుల రిజిస్టర్ ఒక్కటే సరిపోతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.అదే విధంగా, 10(1) రిజిస్టర్, అడంగల్స్, ఎస్ఎఫ్ఎ లాంటి పాత రెవెన్యూ రికార్డులు ఉన్నా, ఎసైన్మెంట్ రిజిస్టర్లు లేదా డీఆర్ దస్త్రాలు ఉన్నా సరిపోతాయి. రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్, రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఏదోకటి సరిపోతుంది. దాదాపు 8 రకాల రిజిస్టర్లు, డికేటీ పట్టాలలో ఏదైనా ఒకటి ఉన్నా 22ఏ నుంచి తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. అదనంగా పత్రాలు కావాలని భూయజమానులు తిరుగరాదు అని స్పష్టం చేశారు.నూతన సంవత్సరం బహుమతిగా రాష్ట్ర ప్రభుత్వం భూయజమానులకు భారీ ఊరట కలిగించింది. రైతుల మరియు భూయజమానుల హక్కులు రక్షించడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa