పేద, మధ్య తరగతి ప్రజలకు కార్పొరేట్ వైద్యం భారం కాకూడదనే కారణంతో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన తీసుకొచ్చింది. దీని ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తోంది. అయితే, కొద్ది రోజుల క్రితం 70 ఏళ్ల వయసు దాటిన సీనియర్ సిటిజన్లకు ఈ స్కీమ్ పొడిగించింది. వయో వృద్ధులకు మరో రూ.5 లక్షల బీమా అదనంగా ఇస్తోంది. దీంతో చాలా కుటుంబాలు కవరేజీ లిమిట్పై అయోమయంలో పడ్డారు. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలు ఈ విషయంపై కన్ఫ్యూజ్ అవుతున్నాయి.
ఉమ్మడి కుటుంబాల విషయానికి వచ్చినప్పుడు అమ్మమ్మ-తాతయ్య, నానమ్మ-తాతయ్యలు ఒకే కుటుంబంలో ఉండి 70 ఏళ్ల వయసు దాటినప్పుడు ఉచిత బీమా కవరేజీ లిమిట్పై ప్రశ్న తలెత్తుతోంది. అలాంటి ఫ్యామిలీ ఆయుష్మాన్ భారత్ ద్వారా రూ.15 లక్షల ఉచిత బీమా కవరేజీ పొందుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే, అలా ఏం ఉండదు. అలాంటి సందర్భాల్లోనూ ఆయుష్మాన్ భారత్ ఉచిత వైద్యం కవరేజీ రూ.15 లక్షలకు పెరగదు. మరి ఎందుకు పెరగదు అనే విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల కవరేజీ ఇస్తున్నారు. అయితే, కుటుంబంలో ఎంతమంది ఉన్నా రూ.5 లక్షలు మాత్రమే బీమా ఉంటుంది. కానీ, 2024, అక్టోబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం 70 ఏళ్ల వయసు దాటిన సీనియర్ సిటిజన్లకు వారి ఆదాయం, ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అదనంగా రూ.5 లక్షల బీమా కవరేజీ కల్పించింది. 2025, డిసెంబర్ నాటికి 93 లక్షలకు పైగా ఆయుష్మాన్ వయ వందన కార్డులను జారీ చేశారు. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ పరిధిలోకి వచ్చే కుటుంబంలో 70 ఏళ్ల వయసు దాటిన వారు ఉంటే అదనంగా రూ.5 లక్షల కవరేజీ ఉంటుంది. దీంతో గరిష్ఠ పరిమితి రూ.10 లక్షల వరకు ఉంటుంది.
అయితే, ఎక్కువ మంది వృద్ధులు ఉన్నప్పుడు కవరేజీపై అయోమయం నెలకొంది. ఇరువైపుల వారి గ్రాండ్ పేరెంట్స్ ఉన్నప్పుడు కవరేజీ సమస్య వస్తోంది. ఒక కుటుంబానికి బేసిక్ కవరేజీ రూ.5 లక్షలు, నాన తరపు తల్లిదండ్రులకు రూ.5 లక్షలు, అమ్మ తరపు వారి తల్లిదండ్రులకు రూ.5 లక్షలు మొత్తంగా రూ.15 లక్షల ఉచిత వైద్యం వస్తుందని భావిస్తున్నారు. అయితే, అలా ఏం ఉండదు. ఆయుష్మాన్ భారత్ పోర్టల్లోని FAQ ప్రకారం వయ వందన స్కీమ్ కింద ఉన్న సీనియర్ సిటిజన్లకు సైతం కుటుంబం వారీగానే కవరేజీ లభిస్తుంది, కానీ వ్యక్తిగతంగా ఉండదు. అంటే ఒక్కొక్కరికి ఉండదు, కుటుంబంలో ఎంత ఉంటే అంత మందికి రూ.5 లక్షలు మాత్రమే ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa