ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంతర్జాతీయ క్రికెట్‌లో రెండో అత్యధిక పరుగుల వీరుడిగా కోహ్లీ

sports |  Suryaa Desk  | Published : Mon, Jan 12, 2026, 06:02 AM

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజ ఆటగాడు కుమార సంగక్కరను అధిగమించాడు. ఈ జాబితాలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మాత్రమే కోహ్లీ కన్నా ముందున్నాడు.ఆదివారం వడోదరలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు. మ్యాచ్‌లో భాగంగా 20వ ఓవర్ ఐదో బంతికి తన 42వ పరుగు పూర్తి చేసినప్పుడు, సంగక్కర పేరిట ఉన్న 28,016 పరుగుల రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. సంగక్కర 594 మ్యాచ్‌లలో ఈ పరుగులు సాధించగా, కోహ్లీ మరింత వేగంగా ఈ ఘనతను చేరుకున్నాడు.ఇదే మ్యాచ్‌లో కోహ్లీ మరో రికార్డును కూడా సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 28,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. కోహ్లీ కేవలం 624 ఇన్నింగ్స్‌లలోనే ఈ మార్కును చేరుకోగా, గతంలో ఈ రికార్డు సచిన్ 644 ఇన్నింగ్స్‌లు పేరిట ఉండేది.ఈ మ్యాచ్‌కు ముందు 28,000 పరుగులకు 25 పరుగుల దూరంలో ఉన్న కోహ్లీ, 13వ ఓవర్లో బౌండరీతో ఆ మైలురాయిని దాటాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డు 34,357 పరుగులతో సచిన్ టెండూల్కర్ పేరు మీదే అగ్రస్థానంలో ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa