శబరిగిరిలో మకర సంక్రాంతి వేళ మకర జ్యోతి దర్శనం కోసం భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేరళ హైకోర్టు ఆదేశాలతో దర్శన కోటాపై ఆంక్షలు విధిస్తూనే, పక్కా భద్రతా ఏర్పాట్లు చేశారు. జనవరి 14న మకరజ్యోతి దర్శనం రోజున కోటాను 30 వేలకు పరిమితం చేశారు. 13న 35,000 మందికి, 15 నుంచి 18 వరకు ప్రతిరోజూ 55,000 మందికి అవకాశం కల్పించారు. తిరువాభరణ ఊరేగింపు నేపథ్యంలో 14న ఉదయం 10 గంటల నుంచి నిలక్కల్-పంబ మార్గంలో భక్తుల రాకపోకలను నిలిపివేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa