అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అనంతపురంలో ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అయితే ఆ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్దీన్ మీద ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అనుచరులు దాడిచేశారని ఆరోపణలు వచ్చాయి. ఎగ్జిబిషన్ నిర్వాహకుడిని బెదిరించారంటూ సోమవారం ఆరోపణలు వచ్చాయి. అలాగే ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్ధీన్ ఈ విషయం మీద అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు గంగారాం, ఎమ్మెల్యే గన్మెన్ షేక్షా మద్యం సేవించి ఎగ్జిబిషన్ వద్ద వీరంగం సృష్టించారని ఫిర్యాదు చేశారు. పది లక్షల రూపాయలు ఇవ్వాలంటూ తనను బెదిరించారంటూ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్ధీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన అనంతపురం పోలీసులు.. ఘటనపై దర్యాప్తు జరిపించారు. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గన్మెన్ షేక్షావలిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు అనంతపురం ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం జిల్లా వదిలి వెళ్లకూడదని స్పష్టం చేశారు. మరోవైపు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గతంలోనూ వివాదంలో చిక్కుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓ ఆడియో వైరల్ అయ్యింది. దీనిపై తారక్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. అలాగే టీడీపీ అధిష్టానం కూడా సీరియస్ అయినట్లు సమాచారం.
మరోవైపు దగ్గుబాటి ప్రసాద్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన దగ్గుబాటి ప్రసాద్.. సమీప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనంత వెంకటరామి రెడ్డిపై 23,023 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
అంతకుముందు దగ్గుబాటి ప్రసాద్ రాప్తాడు ఎంపీపీగా పనిచేశారు. అయితే 2024 ఎన్నికల సమయంలో సీనియర్ నాయకులను కాదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అనంతపురం టికెట్ను దగ్గుబాటి ప్రసాద్కు కేటాయించారు. ఇక అధినేత నమ్మకాన్ని నిలబెడుతూ దగ్గుబాటి ప్రసాద్ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుపొందారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa