‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సక్సెస్తో యూనిట్ ఆనందంలో ఉంది. ఈ క్రమంలో మూవీ ఘన విజయం సాధించిన సందర్భంగా.. చిత్ర బృందం తణుకులో సంబరాలు చేసుకుంది. ఈ వేడుకల్లో భాగంగా దర్శకుడు అనిల్ రావిపూడి స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసి, సినిమా విజయం గురించి చర్చించారు. అనంతరం, అనిల్ రావిపూడి వీ మ్యాక్స్ థియేటర్లో అభిమానులను కలిసి, వారి అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తన నివాసంలో చిత్ర బృందాన్ని సాదరంగా ఆహ్వానించి, పుష్పగుచ్ఛాలు, జ్ఞాపికలు, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా సినిమా, కళలు, సాహిత్యం, సంస్కృతి వంటి అంశాలపై వారితో ఎమ్మెల్యే చర్చించారు.
"చిన్నతనం నుంచి చిరంజీవి సినిమాలను ఇలాగే థియేటర్కు వెళ్లి చూశాను.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాను దర్శకత్వం చేసే స్థాయికి ఎదగడం, ఇలా ప్రేక్షకుల ముందుకు రావడం మర్చిపోలేను. మెగా అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలతో ఎంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను. సినిమాను ఆదరిస్తున్న అభిమానులే నా దేవుళ్లుగా భావిస్తున్నాను. త్వరలోనే మరో భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తాను. ప్రేక్షకులే నాకు దేవుళ్లు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు" తెలిపారు దర్శకుడు అనిల్ రావిపూడి.
గణపవరంలోని మహాలక్ష్మీ థియేటర్లో మన శంకర వరప్రసాద్ చిత్ర విజయోత్సవ సభలో అనిల్ రావిపూడి పాల్గొన్నారు. అలాగే ఏలూరులో కూడా అనిల్ రావిపూడి సందడి చేశారు. ఎస్వీసీ సినిమా థియేటర్లో ఫ్యాన్స్తో మాట్లాడారు. గంగానమ్మ జాతరకు సంబంధించిన అమ్మవారి మేడలను సందర్శించి పూజలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్గా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతి పండుగకు విడుదలైంది.. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా నటించారు. భారీ కలెక్షన్లతో హిట్ టాక్తో థియేటర్లలో నడుస్తోంది. ఈ సినిమా ఫస్ట్ డే నుంచే భారీ వసూళ్లు సాధించింది.. తొలి వారంలో రూ.292 కోట్ల గ్రాస్ను నమోదు చేసి రికార్డులు క్రియేట్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa