ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో పాల్గొన్న మహ్మద్ షమీ

sports |  Suryaa Desk  | Published : Wed, Jan 21, 2026, 01:46 PM

భారత క్రికెటర్ మహ్మద్ షమీ ఎన్నికల అధికారుల ఎదుట హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా పలువురు ప్రముఖులకు ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో నోటీసులు అందుకున్న మహ్మద్ షమీ నిన్న కోల్‌కతాలోని బిక్రంగఢ్ ప్రాంతంలో గల ఒక పాఠశాలలో ఎన్నికల సంఘం అధికారుల ముందు హాజరై అవసరమైన పత్రాలను సమర్పించారు.ఎస్ఐఆర్ దరఖాస్తులో షమీ సమర్పించిన వివరాల్లో కొన్ని వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించామని, అందువల్ల విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశామని ఎన్నికల సంఘం సీనియర్ అధికారులు తెలిపారు. ఇదివరకే ఒకసారి నోటీసులు జారీ చేసినప్పటికీ, క్రికెట్ మ్యాచ్ కారణంగా ఆయన హాజరుకాలేకపోయారని, అందువలన మరొక అవకాశం కల్పించినట్లు వారు వెల్లడించారు.ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మహ్మద్ షమీ క్రికెట్ వృత్తిరీత్యా కోల్‌కతాలో నివాసం ఏర్పరుచుకున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని 93వ వార్డులో ఓటరుగా నమోదు చేసుకున్నారని, ఆ వార్డు రాస్‌బిహారీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుందని అధికారులు తెలియజేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa