ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిబ్రవరి 3 నుంచి ప్రజలకు అందుబాటులోకి అమృత్‌ ఉద్యాన్‌

national |  Suryaa Desk  | Published : Wed, Jan 21, 2026, 02:01 PM

రాష్ట్రపతి భవన్‌లోని అమృత్‌ ఉద్యాన్‌ ఫిబ్రవరి 3 నుంచి మార్చి 31 వరకు ప్రజల సందర్శనార్థం తెరుచుకోనుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 35వ గేట్‌ ద్వారా సందర్శకులకు అనుమతి ఉంటుంది. నిర్వహణ నిమిత్తం అన్ని సోమవారాలు, మార్చి 4న హోలీ సందర్భంగా సెలవు. సందర్శకులు రాష్ట్రపతి భవన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి లేదా 35వ ప్రవేశద్వారం వద్ద ఆఫ్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. ప్రజల సౌకర్యార్థం మెట్రోస్టేషన్‌ నుంచి బస్సు సౌకర్యం కల్పించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa