న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్ను భారత్ కోల్పోవడంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానే జట్టు ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ, గంభీర్కు ఒక ముఖ్యమైన సలహా ఇచ్చాడు. జట్టులో తరచూ మార్పులు చేయడమే ఓటములకు దారితీస్తోందని ఆయన అభిప్రాయపడ్డాడు.శుభ్మన్ గిల్ కెప్టెన్సీలోని భారత జట్టు, సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించినా దానిని నిలబెట్టుకోలేకపోయింది. చివరికి 1-2 తేడాతో సిరీస్ను చేజార్చుకుంది. ఇండోర్లో జరిగిన చివరి వన్డేలో 338 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (124) అద్భుత శతకం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. స్వదేశంలో న్యూజిలాండ్పై భారత్కు ఇదే తొలి వన్డే సిరీస్ ఓటమి కావడం, గంభీర్ కోచింగ్లో ఇది మూడో సిరీస్ ఓటమి కావడంతో విమర్శలు మరింత తీవ్రమయ్యాయి.క్రిక్బజ్తో మాట్లాడుతూ రహానే ఈ అంశంపై స్పందించాడు. "జట్టు ఓటమిపై కఠినమైన ప్రశ్నలు ఎదురవుతాయి. గత 9 వన్డేల్లో భారత్ ఐదు మ్యాచ్లు ఓడిపోయింది. దీనికి కారణం జట్టులో అధిక మార్పులే. 2027 ప్రపంచకప్ను లక్ష్యంగా చేసుకున్నప్పుడు, ఆటగాళ్లకు యాజమాన్యం నుంచి స్పష్టత, భద్రతా భావం అవసరం" అని అన్నాడు. న్యూజిలాండ్-బీ జట్టుగా భావించిన టీమ్పై భారత్ 3-0తో గెలుస్తుందని అందరూ ఆశించారని, కానీ కివీస్ అద్భుతంగా ఆడిందని ప్రశంసించాడు.భారత్కు తదుపరి వన్డే సిరీస్ ఆరు నెలల దూరంలో ఉంది. ఈ విరామ సమయంలోనైనా జట్టు యాజమాన్యం దీర్ఘకాలిక ప్రణాళికతో ఆటగాళ్లను గుర్తించి, వారికి పూర్తి మద్దతుగా నిలవాలని రహానే సూచించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa