ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అటల్ పెన్షన్ యోజన పధకం పొడిగింపు

national |  Suryaa Desk  | Published : Wed, Jan 21, 2026, 03:03 PM

కోట్లాది మంది కార్మికులకు వృద్ధాప్య భద్రత కల్పిస్తున్న అటల్ పెన్షన్ యోజన (APY) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ‌ జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ పథకాన్ని 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించేందుకు ఆమోదం తెలిపారు. ఈ పథకంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు, ప్రచార కార్యక్రమాలకు అవసరమైన నిధుల మద్దతును కూడా కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.అసంఘటిత రంగ కార్మికులకు వృద్ధాప్యంలో ఆదాయ భద్రత కల్పించే లక్ష్యంతో 2015 మే 9న ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇందులో చేరిన వారు చెల్లించే చందాను బట్టి, 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు కనీస గ్యారెంటీ పెన్షన్ లభిస్తుంది. ఈ పథకం ద్వారా దేశంలో పెన్షన్ తీసుకునే వారి సంఖ్యను పెంచడం, ఆర్థిక చేరికను ప్రోత్సహించడం, 'వికసిత భారత్ @2047' లక్ష్య సాధనకు తోడ్పడటం ప్రభుత్వ ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.ఈ ఏడాది జనవరి 19 నాటికి ఈ పథకంలో 8.66 కోట్లకు పైగా చందాదారులు చేరారు. ఈ పథకం అమలులో ప్రభుత్వ రంగ బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తుండగా, మొత్తం నమోదులలో 70.44 శాతం వాటాను అవే కలిగి ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరి నాటికి ఈ స్కీమ్‌లో కొత్తగా చేరే వారి సంఖ్య 24 శాతం వృద్ధిని సాధించి, ప్రజల్లో విశేష ఆదరణ పొందుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa