ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామ పంచాయతీ వినూత్న తీర్మానం,,,,భార్యలు చనిపోయిన భర్తలకు ఫించన్

national |  Suryaa Desk  | Published : Tue, Feb 10, 2026, 10:54 PM

భర్త చనిపోయిన భార్యలు ఒంంటరి మహిళలైతే... భార్య చనిపోయిన భర్తలు ఒంటరి పురుషులే కదా... అందుకే వింతంతువులకు ఫించన్ ఇచ్చినట్టే.. మా పురుష విధురులకు కూడా ఫింఛన్ ఇప్పించండి.. అంటూ.. టీడీపీ కార్యకర్త ఒకరు గత సంవత్సరం జులైలో పుట్లూరు ఎమ్మెల్యే శ్రావణకి చిత్రమైన విన్నపం చేశారు. అప్పుడు అక్కడనున్నవారంతా ఒక్కసారిగా ఫక్కున నవ్వారు.. ఆ తర్వాత ఆ వార్త బాగా వైరల్ అయ్యింది... దాని మీద చాలా మంది మీమ్స్ చేసి సరదాగా షేర్ చేసుకున్నారు కూడా.. కానీ.. మహారాష్ట్రలోని ఓ గ్రామస్థులు మాత్రం ఆ సమస్యను అందరిలా కామెడీగా చూడలేదు.. ఆ సమస్య లోతును అర్థం చేసుకున్నారు.. మహిళలకు ఫించను ఇచ్చినట్టే భార్యను కోల్పోయిన భర్తలకూ ఫించను ఇవ్వాల్సిందే అని.. నిండు గ్రామ సభలో ఏక గ్రీవంగా తీర్మానించేశారు...


సాధారణంగా ప్రభుత్వ ఫించను పథకాలు అంటే మనకు ఎక్కువగా మహిళలు, పిల్లలు, వృద్ధులు లేదా వికలాంగులు మాత్రమే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. వీకర్ సెక్షన్ కి, నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి ఆసరా ఇవ్వడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.. కానీ, సమాజంలో ఎంత వెనుకడి ఉన్నా కూడా... ఒక వర్గం మాత్రం ఎప్పుడూ నిశ్శబ్దంగానే ఉండిపోతోంది. వారే 'విధురులు' (భార్యను కోల్పోయిన పురుషులు). భర్త మరణిస్తే భార్యకు వితంతు పింఛన్ ఇచ్చి ఆదుకుంటున్న ప్రభుత్వాలు, భార్య మరణించి ఆర్థికంగా చితికిపోయిన భర్తకు ఎందుకు భరోసా ఇవ్వడం లేదనే ప్రశ్న 2025 జులై 19న ఆంధ్రప్రదేశ్ లో పుట్టింది.. ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యాక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా పూట్లూరు మండలం తక్కలపల్లి గ్రామంలో ఎమ్మెల్యే శ్రావణి పర్యటించారు.. ఈ సందర్భంగా కొత్త ఫించన్‌లు ఇప్పించాలని పలువురు వితంతువులు ఎమ్మెల్యేకి విన్నవించారు. అదే సమయంలో టీడీపీ కార్యకర్త విజయ భాస్కర్‌ రెడ్డి, తన భార్య ఏడాది కిందటే మృతిచెందారని, తనకు కూడా పింఛన్‌ ఇప్పించాలని కోరారు. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ‘మీ బాధ నాకు అర్థమైంది. భార్యలను కోల్పోయిన భర్తలకు పింఛన్‌ ఇచ్చే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళతాను’ అని హామీ ఇచ్చారు.


అయితే.. అదే ప్రశ్న ఇప్పుడు మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామంలో పెను మార్పును తీసుకొచ్చి.. దేశవ్యాప్త చర్చకు దారి తీస్తోంది. అహిల్యానగర్‌ జిల్లాలోని సోనేవాడి గ్రామసభ ఒక చారిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించింది. ఆర్థికంగా బలహీనంగా ఉండి, భార్యను కోల్పోయిన పురుషులకు కూడా మహిళా వితంతువుల మాదిరిగానే ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాలు వర్తింపజేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. కిశోర్‌ జవాలే అనే గ్రామస్థుడు ఈ ప్రతిపాదనను తీసుకువస్తూ.. సామాజిక న్యాయం అనేది Gender ఆధారంగా ఉండకూడదని, అవసరం ఉన్న ప్రతి ఒక్కరికీ అందాలని వాదించారు. కేవలం ఆ ఒక్క గ్రామంలోనే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పురుషులు 150 మంది ఉండటం ఈ సమస్య తీవ్రతను మరింత పెంచేసింది. దీంతో.. దీనిపై సభ్యులు సుదీర్ఘంగా చర్చించి.. పథకాల అమలులో వివక్షతో సామాజిక అసమానతలు పెరుగుతాయంటూ తీర్మానాన్ని ఆమోదించినట్లు సభకు అధ్యక్షత వహించిన గ్రామ సర్పంచి శకుంతలా తాయి తెలిపారు. ఈ తీర్మానం కాపీని సంబంధిత ప్రభుత్వ విభాగాలకు పంపుతామని గ్రామ పంచాయతీ అధికారి భానుదాస్‌ దభాడే ప్రకటించారు. సోనేవాడి గ్రామ పంచాయతీ చేసిన ఈ తీర్మానం రేపటి రోజున దేశవ్యాప్తంగా కొత్త సామాజిక చట్టాలకు పునాది కావచ్చు. సామాజిక న్యాయం అనేది లింగ వివక్షకు తావులేకుండా, అర్హత, అవసరంప్రాతిపదికన సాగాలన్నదే ఈ గ్రామస్థుల ఆకాంక్ష.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa