ప్రధాన మంత్రి నూతన కార్యాలయం ‘సేవా తీర్థ్’ లోకి ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 13న శుక్రవారం అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన నాలుగు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహిళా సాధికారికత, వ్యవసాయ మౌలిక సౌకర్యాలు, అత్యవసర వైద్య సంరక్షణ, ఆవిష్కరణ ఆర్థిక వ్యవస్థ సంబంధించిన ఫైళ్లపై ప్రధాని సంతకం చేశారు. అత్యవసర వైద్య సంరక్షణలో భాగంగా ప్రధాన మంత్రి రహత్ పథకం ప్రారంభిస్తున్నటు ప్రధాని మోదీ వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారికి తక్షణ వైద్య చికిత్స అందజేయడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం.
దీనికి కింద బాధితులకు రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్యం అందజేయనున్నారు. ఆర్థికపరమైన కారణాల వల్ల బాధితులకు గోల్డెన్ హవర్లో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. అటువంటి ఇబ్బందులను నివారించి, బాధితులకు సకాలంలో వైద్యం అందజేసి ప్రాణాలను నిలబెట్టడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అత్యవసర స్పందన వ్యవస్థలను బలోపేతం చేయడం, ఆకస్మిక వైద్య సంక్షోభాన్ని ఎదుర్కొనే బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో ప్రధాని రహత్ పథకం తీసుకొచ్చినట్టు కేంద్ర ప్రబుత్వం అధికారులు తెలిపారు.
ఈ పథకంతో పాటు మహిళా సాధికారికత కోసం లక్పత్ దీదీ స్కీమ్ను మరింత విస్తరించాలని నిర్ణయించారు. మార్చి 2029 నాటికి 6 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. స్థిరమైన జీవనోపాధి కార్యకలాపాల ద్వారా డ్వాక్రా మహిళల వార్షిక ఆదాయం కనీసం లక్ష రూపాయాలకు తీసుకెళ్లడమే దీని లక్ష్యం. దీని ద్వారా గ్రామీణ ఆదాయం పెంపు, మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం వైపు ఘనమైన పురోగతిని అందుకోవడం.
వ్యవసాయ రంగంలో గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇస్తూ, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కోసం వ్యయాన్ని రూ.1 లక్ష కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్లకు రెట్టింపు చేశారు. ఈ నిధి పంటకోత నిర్వహణ మౌలిక సదుపాయాలు, గిడ్డంగులు, కోల్డ్-స్టోరేజ్ యూనిట్లు, ప్రాసెసింగ్ సౌకర్యాలు వంటి కమ్యూనిటీ వ్యవసాయ సౌకర్యాల కల్పన మద్దతు ఇస్తుంది. వ్యవసాయ ఛైన్ వెల్యూను బలోపేతం చేయడానికి, వృధాను తగ్గించడానికి, రైతుల ఆదాయాలను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుందని ప్రభుత్వం చెబుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa