అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2025లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన సైనిక ఉద్రిక్తతలను తానే స్వయంగా మధ్యవర్తిత్వం వహించి ఆపానని మరోసారి చెప్పుకొచ్చారు. అయితే ఈ క్రమంలో ఆయన చెప్పిన గణాంకాలు వాస్తవాలకు దూరంగా, భారీ అతిశయోక్తులతో కూడి ఉండగా.. అంతర్జాతీయ స్థాయిలో ఈ విషయాలు చర్చనీయాంశం అయ్యాయి.
షెహబాజ్ షరీఫ్ను నిలబెట్టి, ఇబ్బంది పెట్టి..!
ఇటీవల జరిగిన 'బోర్డ్ ఆఫ్ పీస్' కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగిస్తూ.. తన మధ్యవర్తిత్వ నైపుణ్యాలను కొనియాడారు. ఇదే వేదికపై ఉన్న పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ను ఉద్దేశించి "ఒక్క నిమిషం నిలబడండి" అని కోరారు. "భారత్-పాక్ మధ్య ఒప్పందం కుదిర్చి నేను 2.5 కోట్ల మంది ప్రాణాలను కాపాడానని మీరు గతంలో చెప్పారు కదా" అంటూ షరీఫ్ను ప్రశ్నించారు. ట్రంప్ అడిగిన ఈ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక.. పాక్ ప్రధాని తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. గతంలో తాను 10 మిలియన్ల ప్రాణాలు కాపాడానన్న ట్రంప్.. ఇప్పుడు ఆ సంఖ్యను ఏకంగా 25 మిలియన్లకు పెంచేయడం గమనార్హం.ఇదీ చూడండి: 'నేనే భారత్-పాక్ యుద్ధాన్ని ఆపా.. కానీ ఎవరూ క్రెడిట్ ఇవ్వట్లేదు': నెతన్యాహుతో ట్రంప్
సుంకాల బెదిరింపులతోనే యుద్ధం ఆపాను..!
యుద్ధం ఆపడానికి తాను సుంకాల అస్త్రాన్ని వాడానని ట్రంప్ చెప్పుకొచ్చారు. "నేను మోదీని, షరీఫ్ను పిలిచి చెప్పాను.. మీరు యుద్ధానికి దిగితే మీ దేశాల నుంచి వచ్చే ఉత్పత్తులపై 200 శాతం సుంకం విధిస్తాను. అప్పుడు వ్యాపార ఒప్పందాలు ఏవీ ఉండవని హెచ్చరించాను. డబ్బు పోతుందని తెలియగానే వారు యుద్ధం వద్దు అనుకున్నారు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే గతంలో 7 యుద్ధ విమానాలు మాత్రమే కూలిపోయాయని చెప్పుకొచ్చిన ట్రంప్.. ఈ సారి వాటి సంఖ్యను 11కు పెంచారు. అంతేకాకుండా అవి చాలా ఖరీదైనవని ఆయన పేర్కొన్నారు.ఇదీ చూడండి: 'మోదీ ఫోన్ చేస్తేనే.. భారత్-పాక్ యుద్ధాన్ని ఆపాను': ట్రంప్ సరికొత్త వ్యాఖ్యలు
భారత్ స్పందన ఏమిటి?
భారతదేశం ట్రంప్ చేస్తున్న ఈ మధ్యవర్తిత్వ వాదనలను మొదటి నుంచీ తోసిపుచ్చుతూనే వస్తోంది. 2025 మేలో పహల్గామ్ దాడికి నిరసనగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' తర్వాత.. ఇరు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ నేరుగా చర్చలు జరిపి కాల్పుల విరమణకు అంగీకరించారని భారత్ స్పష్టం చేసింది. ఈ ఒప్పందంలో మూడో పక్షం జోక్యమే లేదని తేల్చి చెప్పింది. అలాగే విమానాల నష్టం కూడా జరగలేదని భారత్ పదే పదే వ్యాఖ్యానిస్తోంది. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన ఒక్క ఏడాదిలోనే తాను 8 యుద్ధాలను ఆపానని చెప్పుకుంటున్న ట్రంప్.. ఈ భారత్-పాక్ అంశాన్ని మాత్రం ఇప్పటికే 80 సార్లకు పైగా ప్రస్తావించడం ఆయన ఎన్నికల వ్యూహంలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa