అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణించినట్టు ఇరాన్ ప్రభుత్వ మీడియా ఆదివారం ధ్రువీకరించింది. ఇదే సమయంలో, ఇరాన్ ప్రయోగించిన వందలాది క్షిపణులు, డ్రోన్లతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)పై భీకర దాడి జరిగింది. ఈ పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి.యూఏఈపై ఇరాన్ మొత్తం 137 బాలిస్టిక్ క్షిపణులు, 209 డ్రోన్లతో దాడి చేసిందని, వాటిలో చాలా వరకు విజయవంతంగా అడ్డుకున్నామని యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 132 క్షిపణులను గాల్లోనే ధ్వంసం చేయగా, 195 డ్రోన్లను కూల్చివేసినట్టు తెలిపింది. మిగిలినవి సముద్రంలో, దేశంలోని వివిధ ప్రాంతాల్లో పడ్డాయని పేర్కొంది.ఈ దాడుల శిధిలాలు అబుదాబి, దుబాయ్లలో పడటంతో నష్టం వాటిల్లింది. అబుదాబిలోని జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా వచ్చిన డ్రోన్ను అడ్డుకునే క్రమంలో దాని శకలాలు కిందపడి ఆసియా దేశానికి చెందిన ఒకరు మరణించగా, మరో ఏడుగురు గాయపడ్డారు. దుబాయ్లోని పామ్ జుమేరా ప్రాంతంలో ఓ భవనంపై క్షిపణి శిధిలాలు పడటంతో నలుగురు గాయపడ్డారు. ఈ దాడుల వల్ల విమాన రాకపోకలకు అంతరాయం కలిగి, సుమారు 20,200 మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa