ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్టు ప్రకటించిన ఇరాన్

international |  Suryaa Desk  | Published : Tue, Mar 03, 2026, 02:40 PM

అమెరికా, ఇజ్రాయెల్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ చమురు వాణిజ్యానికి గుండెకాయలాంటి హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మార్గం గుండా వెళ్లేందుకు ప్రయత్నించే ఏ నౌకనైనా తగలబెడతామని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రకటనతో అంతర్జాతీయ వాణిజ్య రంగంలో తీవ్ర గందరగోళం నెలకొంది.ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్-ఇన్-చీఫ్‌కు సీనియర్ సలహాదారు అయిన బ్రిగేడియర్ జనరల్ సర్దార్ ఇబ్రహీం జబారీ ఈ ప్రకటన చేశారు. "హోర్ముజ్ జలసంధి మూసివేయబడింది. ఎవరైనా దాటడానికి ప్రయత్నిస్తే, మా సైనికులు ఆ నౌకలను తగలబెడతారు" అని ఆయన ఇరాన్ ప్రభుత్వ మీడియా ద్వారా స్పష్టం చేశారు. అయితే, ఈ ప్రకటనను అమెరికా సెంట్రల్ కమాండ్ వర్గాలు ఖండించాయి. జలసంధి తెరిచే ఉందని పేర్కొన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa