వర్షం కారణంగా Rajasthan Royals vs Mumbai Indians మ్యాచ్ ఆలస్యమైంది. దీంతో అంపైర్లు మ్యాచ్ను 11 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది.ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్, వైభవ్ సూర్యవంశీ జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వైభవ్ కేవలం 14 బంతుల్లో 39 పరుగులు చేసి దూకుడు చూపించాడు. అతని ఇన్నింగ్స్లో 5 భారీ సిక్సులు ఉండటం విశేషం.మరోవైపు జైశ్వాల్ మరింత అగ్రెసివ్గా ఆడి 32 బంతుల్లో 77 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్లో ఫోర్లు, సిక్సులతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.సూర్యవంశీ ఔటైన తర్వాత వచ్చిన ధ్రువ్ జురెల్ కేవలం 2 పరుగులకే వెనుదిరిగాడు. అనంతరం Riyan Parag వేగంగా ఆడే ప్రయత్నంలో 20 పరుగుల వద్ద ఔటయ్యాడు (2 ఫోర్లు, 1 సిక్స్). చివర్లో హెట్మేయర్ భారీ షాట్లు ఆడలేకపోయాడు.ముంబై బౌలర్లలో గజన్ఫర్ రెండు వికెట్లు తీయగా, Shardul Thakur ఒక వికెట్ సాధించాడు.మొత్తంగా చూస్తే 11 ఓవర్ల షార్ట్ మ్యాచ్లో రాజస్థాన్ భారీ స్కోర్ నమోదు చేసి ముంబై ముందు బలమైన టార్గెట్ ఉంచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa