ట్రెండింగ్
Epaper    English    தமிழ்

1001 నిషేధంతో అన్న‌దాత కుదేలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 26, 2019, 11:36 AM

తరుముకొచ్చిన ఖరీఫ్‌ను స్వాగతించిన‌ అన్నదాత మరో క్రతువుకు సిద్ధమయితే. స‌ర్కారు నిర్ణ‌యం ఆశ‌నిపాతంలా త‌యారైంది.   రైతులకు సాగు కష్టాలు విత్తు నుంచే ఆరంభమయ్యాయి. పౌరసరఫరాల శాఖ ద్వారా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించటంతో దొడ్డు రకంగా పేరొందిన 1001 రకం వరి సాగును ప్రభుత్వం ఈ ఏడాది పూర్తిగా నిషేధించింది. ఈ రకం విత్తనాల సరఫరాను ఏపీ సీడ్సు నిలిపేసింది. ప్రైవేటు మార్కెట్లోనూ విక్రయాలు నిలిపేశారు. ఈమేరకు వ్యాపారులకు కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో  ప్రత్యామ్నాయంపై దృష్టి సారించిన  రైతుల కోసం   1001కి సమాన రకాలుగా పుష్యమి, శ్రీధృతి, తరంగిణి విత్తనాలను ప్రభుత్వం తెరపైకి తెచ్చి,  సమకూర్చిన విత్తనాలకు డిమాండు ఏర్పడడంతో పంపిణీ ఆగమేఘాలపై  చేస్తామ‌న్న అధికారులు సరిపడా విత్తనాలు అందించలేక   మధ్యలోనే చేతులెత్తేశారు.


  ప్రైవేటు మార్కెట్‌లో  విత్త‌నాల‌ ‘నిల్వలు లేవు’ అనే సూచికలు దర్శనమిస్తున్నాయి. ప్ర‌భుత్వం చేసిన నిషేధం త‌మ పొట్టొడుతోందంటున్నారు రైతాంగం? మరి సాగు సాగేదెలా?  త‌మ‌ బాధలు తీరేదెలా? అన్న ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబుదొర‌క‌ని ప‌రిస్థితి ఇప్పుడు ఏపిలో నెల‌కొంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa