హర్యానా టీనేజర్ షఫారీ వర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకొంది. అతిపిన్న వయసులో అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ ఆడిన భారత తొలి మహిళగా రికార్డుల్లో చేరింది. సూరత్ లోని లాలాబాయి కాంట్రాక్టర్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో ముగిసిన తొలి టీ-20 మ్యాచ్ ద్వారా షఫాలీ అరంగేట్రం చేసింది. హర్యానాకు చెందిన 15సంవత్సరాల షఫాలీ కేవలం 4 బాల్స్ మాత్రమే ఎదుర్కొని డకౌట్ గా వెనుదిరిగింది. దూకుడుగా ఆడటానికి, భారీషాట్లు బాదటానికి మరోపేరుగా నిలిచే షఫాలీకి వెటరన్ మిథాలీ రాజ్ స్థానంలో భారతజట్టులో చోటు కల్పించారు. ఇప్పటి వరకూ గర్గీ బెనర్జీ మాత్రమే అత్యంత పిన్నవయసులో టీ-20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన భారత మహిళగా ఉంది. ఆ రికార్డును షెఫాలీ అధిగమించగలిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa