సోషల్ మీడియాకు ఎడిక్ట్ అవడంతో పర్యవసానాలు చాలా దారుణంగా వుంటున్నాయో చెప్పే ఘటన ఇది. . తాజాగా ఓ వివాహిత టిక్టాక్ ఫ్రెండ్తో పరిచయాన్ని పెంచుకుని తనకు పెళ్లి అయిందన్న విషయాన్ని కూడా మరిచి,. భర్తను వదిలేసి స్నేహితురాలితో ఉఢాయించింది. ఈ ఘటన తమిళనాడు శివగంగై జిల్లా సానా ఊరణిలో జరిగింది వివరాలలోకి వెళితే... ఊరణికి చెందిన లియోకు ఈ ఏడాది జనవరిలో వినీత తో వివాహం కాగా ఆయన పెళ్లైన 45 రోజులకే ఉద్యోగం నిమిత్తం సింగపూర్ వెళ్లిపోయాడు.
భర్త దూరంగా వుండటంతో వినీత నిత్యం సెల్ఫోన్లో వ్యసనంగా మారిపోయింది. ఈక్రమంలో టిక్టాక్లో వినీతకు, అభి అనే యువతితో ఏర్పడ్డ పరిచయం కాస్తా స్వలింగ సంపర్కానికి దారితీయటంతో చాటు మాటుగా రాసలీలలు సాగించేవారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకోవటమే కాదు వినీత తన భుజంపై అభి ఫోటోను టాటూ కూడా వేయించుకునేంత చనువు పెరిగింది. . ఇద్దరూ చనువుగా ఉన్న వీడియోలు చూసిన భర్త లియో ఆమెను మందలించినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఈ మధ్య సింగపూర్ నుంచి ఇండియా వచ్చిన లియో బీరువాలో వున్న 20 తులాల బంగారం కనిపించక పోవటంతో భార్యని నిలదీసాడు. తనకేం తెలియదని మాట దాటవేసింది. దీంతో ఆగ్రహించిన లియో భార్యను ఆమె పుట్టింటి వద్ద వదిలేసాడు. ఇదే అదనుగా భావించిన వినీత తన స్నేహితురాలికి ఫోన్ చేసి పుట్టింట్లోనుంచి అభితో పారిపోయింది. దీంతో వినీత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa