రాజకీయంగా అతను ఏపార్టీలో ఉన్నా... తానే పార్టీ అని పాతుకు పోయాడు. పార్టీ ఏదైనా తానే ఎమ్మెల్యే అనేంతగా దడ దడలాడించేస్తాడు. ఇసుక కాంట్రాక్టులు, కేబుల్, కమీషన్లు, బదిలీలు, కాదంటే కుళ్లబొడి చేందుకు సిద్ధంగా ఉండే మందీమార్భలం. ఇదంతా ఆమంచి దందా అనేంతగా ఆయనపై ఆరోపణలున్నాయి. అటువంటి చోట ఈమధ్య ఎన్నికల చివరి క్షణంలో వైసీపీలోకి జంప్ అయినా 2019 ఎన్నికల్లో ఓడిపోయాడు. వైసీపీ అధికారంలోకి వచ్చినా తాను మాజీగా ఉండటాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడనే ఆరోపణలూ లేకపోలేదు. ఇప్పటికీ నియోజకవర్గంలో ఆమంచి అనుచరులదే హవా కొనసాగతుందట.
దీనిపై సీఎం వైఎస్. జగన్కు పలు ఫిర్యాదులు అందినా ఏమీ చేయలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కొద్దిరోజుల క్రితం నాగార్జున అనే ఒక జర్నలిస్ట్పై హత్యాయత్నం జరిగింది. తీవ్రగాయాలతో అతడు ఆసుపత్రిలోకి చికిత్స పొందుతున్నాడు. ఆమంచిపై జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు ఇచ్చి వస్తుండగా ఆయన వర్గీయులు దాడిచేశారంటూ నాగార్జున పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనపై ఆరోపణలు చేస్తున్న నాగార్జున జర్నలిస్టు కాదని.. అతడిపై 20కు పైగా పోలీసు కేసులున్నాయంటూ వివరించుకొచ్చారు. తాను ఎవరిపై దాడి చేయలేదంటూ సమర్దించుకునేందుకు సదరు జర్నలిస్టుపై గట్టిగానే ఆరోపణలు చేశారు. అతడిపై దాడిచేసిన వారిని అరెస్ట్ చేశారంటూ చెప్పారు. తాను చాలా మంచోడినంటూ కితాబు ఇచ్చుకునే ప్రయత్నంచేశారు. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa