పీపీఏల అంశంలో తమపై తప్పుడు ఆరోపణలు చేసి ముఖ్యమంత్రి జగన్ అభాసుపాలయ్యారని తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్లో విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం లేకుండా సంస్కరణలు తీసుకొస్తే నేడు రూ.వేలాది కోట్ల నష్టం అంటూ తమ అసమర్థతను వైకాపా ప్రభుత్వం బయట పెట్టుకుందని ఎద్దేవా చేశారు. పీపీఏలపై ప్రధానికి జగ్ రాసిన లేఖలో అన్నీ అవాస్తవాలే ఉన్నాయని ఆరోపించారు. దీర్ఘకాలంలో పునరుత్పాదక విద్యుత్తే చవక అని కేంద్ర ఇంధనశాఖ మంత్రి కూడా సీఎంకు రాసిన లేఖలో చెప్పారని, నిపుణులు, న్యాయస్థానం, కేంద్ర ప్రభుత్వం చెప్పినా ఇంగితం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ దుయ్యబట్టారు. మీడియా సమావేశం పెట్టి తప్పుడు సమచారం ఇచ్చే అధికారం అధికారులకు ఎవరిచ్చారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం చేసే తప్పులకు అధికారులు బలికావొద్దని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa