ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నగర శాఖ సర్వసభ్య సమావేశానికి ఉద్యోగులు హాజ‌రుకండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2019, 04:27 AM

విజయవాడలో శ‌నివారం నిర్వహించనున్న నగర శాఖ సర్వసభ్య సమావేశానికి ఉద్యోగులు హాజరై విజయవంతం చేయాలని నగర శాఖ అధ్యక్ష కార్యదర్శులు కోనేరు రవి జె. స్వామి శుక్ర‌వారం ఒక ప్రకటనలో కోరారు. సర్వసభ్య సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ జిల్లా నాయకులు అతిధులుగా పాల్గొంటారని తెలిపారు. విజయవాడ నగర పరిధిలో సుమారు 5 వేల మంది ఉద్యోగులలో 1200 మందిపైగా సభ్యత్వం కలిగిన ఎపిఎన్జిఓస్ అసోసియేషన్ నగరశాఖ ప్రస్తుత కార్యవర్గం పదవీకాలం ముగిసిందన్నారు. దీనిని పురస్కరించుకొని సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటుచేయడం జరిగిందని సమావేశంలో గత 3 సంవత్సరాలుగా నగర శాఖ చేపట్టిన ఉద్యమాలు సాధించిన విజయాలు జమాఖర్చుల నివేదికను సభ్యుల ముందుంచడం జరిగుతుందన్నారు. సభ్యుల అమూల్యమైన సలహాలు సహేతుకమైన లోపాలను సభదృష్టికి తీసుకువచ్చి రాబోయే నూతన కార్యవర్గానికి మార్గదర్శకులు కావవాల‌ని రవి, స్వామి ఆ ప్రకటనలో కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa