శీతాకాలం ప్రారంభమవడంతో వాతావరణ ఉష్ణోగ్రతలు తగ్గి, శరీరంలోని జీవక్రియలు కూడా మార్పు చెందుతాయి. ముఖ్యంగా మధుమేహం (Diabetes) ఉన్నవారికి ఈ సీజన్లో రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.చక్కెర స్థాయి అధికమైతే గుండె, కిడ్నీలు, ఇతర అవయవాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే, ఈ వింటర్లో సరిగ్గా డైట్ పాటించడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.వింటర్లో తప్పక తీసుకోవలసిన ఆహారాల్లో కూరగాయలు మరియు ఆకుకూరలు ఉంటాయి. క్యారెట్, బీట్రూట్, బచ్చలికూర, క్యాబేజీ, బ్రొకలీ, బీన్స్ వంటి ఆహారాలు షుగర్ స్థాయిలను క్రమంలో ఉంచడంలో, అలాగే బరువు నియంత్రణలో కూడా సహాయపడతాయి.నిమ్మ, నారింజ వంటి విటమిన్-సీ అధిక పండ్లు రోగనిరోధక శక్తిని (Immunity) పెంచుతాయి. అలాగే, బెర్రీలు ‘డయాబెటిస్ సూపర్ఫుడ్’గా పరిగణించబడతాయి. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉండటంతో షుగర్ అకస్మాత్తుగా పెరగదు. చేపలు, గుడ్లు, గింజలు, నట్స్, ముడి ధాన్యాలను డైట్లో చేర్చడం ఇన్సులిన్ స్థాయిలను సరిగా ఉంచడంలో సహాయపడుతుంది.చలికాలంలో వేడివేడిగా ఏదైనా తినాలని, తాగాలని మనసు చేయవచ్చు, కానీ కొన్ని ఆహారాల విషయంలో జాగ్రత్త అవసరం. ఎక్కువ కెఫిన్ ఉన్న టీ, కాఫీ బదులు గ్రీన్ టీ లేదా హెర్బల్ టీను ఎంచుకోవడం మంచిది. తెల్ల అన్నం, ఆలుగడ్డలు వంటి గ్లైసెమిక్ ఇండెక్స్ అధికమైన ఆహారాలను తగ్గించి, బ్రౌన్ రైస్ లేదా గోధుమ రోటీలను ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే, ఆల్కహాల్ తీసుకోవడం డీహైడ్రేషన్కు దారి తీస్తుంది, ఇది షుగర్ పేషెంట్లకు ప్రమాదకరం.చలిని తట్టుకోవడానికి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సరైన మొత్తంలో ప్రోటీన్ తీసుకోవడం అవసరం. ప్రతిరోజూ గుడ్లు, పప్పు, ముక్కలు, మొలకెత్తిన గింజలను డైట్లో చేర్చడం మేలు చేస్తుంది.ఈ వింటర్లో షుగర్ స్థాయిలను అదుపులో ఉంచాలంటే కేవలం ఆహారం మాత్రమే కాక, ప్రతిరోజూ నడక లేదా వ్యాయామం చేయడం కూడా అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa