అవసరానికి మించి రాజధాని పేరుతో రెట్టింపు వ్యయం చేసారని రూ.30 వేల కోట్ల మేర దుబారా జరిగినట్లు అమరావతి రాజధాని పై పీటర్ కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వెల్లడించింది. . రాజధాని, ప్రాజెక్టులు, నిర్మాణాలు, అవకతవకలపై ఏర్పాటైన కమిటీలో పీటర్, పొన్నాడ సూర్యప్రకాశ్,అబ్దుల్ బషీర్, నారాయణ రెడ్డి, ఇయన్ రాజు, ఆదిశేషు సభ్యులుగా ఏర్పడిన కమిటీ అందించిన నివేదికలో 75 శాతం పైగా పూర్తి అయిన టవర్లు, ప్రాజెక్టులపై ఏమి చేయాలనే దానిపై ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలని అయితే . రాజధాని లో చేపట్టిన నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించామని, రాజధాని లోని ప్రతి ప్రాజెక్టు, నిర్మాణాలను పున సమీక్షించాలని నివేదిక లో కమిటీ సూచించింది
కాగా రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధి పై ప్రణాళికల రూపకల్పన, సూచనల కోసం . రిటైర్డ్ ఐఏఎస్ జి ఎన్ రావు నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. దీనికి సంబంధించి బుధవారం విజయవాడలో నిపుణులు కమిటీ తొలి సమావేశం నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు జరిపి, వివిధ వర్గాలతో సంప్రదింపులు జరపాలని సభ్యులు వేర్వేరు ప్రాంతాలలో ఒక్కొక్కరిగా పర్యటించాలని భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa