2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీ ఘోర పరాజయం పాలయ్యింది. ఎన్నడూ లేని విధంగా 23 సీట్లతో ప్రతి పక్ష పార్టీ హోదాలో కొనసాగుతున్నారు. అయితే ఓటమి అనంతరం టీడీపీ నేతల్లో, కార్యకర్తల్లో గుబులు మొదలయ్యింది. వైసీపీ కి ఊహించని రీతిలో భారీ మెజారిటీ ని ప్రజలు కట్టబెట్టడం తో టీడీపీ నేతలు ఒక్కొక్కరిగా బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీ పై ప్రజలకు కూడా పూర్తిగా నమ్మకం లేకుండా పోయింది. ఆ ప్రభావమే గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే ల పై కూడా పడింది. నిన్నా, మొన్నటి వరకు వంశి బీజేపీ లో చేరతారని వార్తలు వచ్చాయి. కానీ టీడీపీ కి రాజీనామా చేసి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు వల్లభనేని వంశీ. వైసీపీ నేతలు, ప్రభుత్వ ఉద్యోగులు తనని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చి వంశి అటు టీడీపీ కి, ఇటు వైసీపీ కి కోలుకోలేని దెబ్బని కొట్టాడు. వైసీపీ ప్రజల్లో ఎంతో నమ్మకాన్ని కూడబెట్టుకున్నా వంశీ చేసిన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో చర్చలు మొదలయ్యాయి. వంశి చేసిన రాజీనామా పట్ల, వైసీపీ నేతల పై చేసిన ఆరోపణల పట్ల వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa