మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ అడ్డదారులు తొక్కుతోందని, తమ ఎమ్మెల్యేలతో బేరసారాలకు తెరవెనుక రాజకీయాలు నడుపుతోందని కాంగ్రెస్, ఎన్సీపీ చేస్తున్న ఆరోపణలను బీజేపీ నేత సుధీర్ ముంగంటివార్ శుక్రవారంనాడు తోసిపుచ్చారు. ఈ ఆరోపణల్లో ఎంత మాత్రం పసలేదని ఆయన కొట్టిపారేశారు. అదే నిజమైతే 48 గంటల్లోగా తమ ఆరోపణలను రుజువు చేసుకోవాలని, అలాకాని పక్షంలో మహారాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా, శనివారంలోగా ప్రభుత్వ ఏర్పాటుకు గడవు ముగియవస్తుండటం, శివసేన-బీజేపీ కూటమి మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి ఎమ్మెల్యేలతో 'బేరసారాల'కు బీజేపీ తెరతీసిందనే ప్రచారం జరుగుతోంది. గురువారంనాడు తమ పార్టికి చెందిన ఎమ్మెల్యేలతో బీజేపీ నేతలు రూ.25 కోట్లు ఇచ్చేందుకు సంప్రదింపులకు దిగారంటూ కాంగ్రెస్ పార్టీ నేత నితిన్ రౌత్ ఇవాళ ఆరోపించారు. కర్ణాటక తరహా పరిస్థితి ఇక్కడ పునరావృతం కానీయమని, అసలు బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయనిచ్చేదే లేదని ఆయన కుండబద్ధలు కొట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa