ఐఎఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యే తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తప్పించి బాపట్లలోని మానవ వనరుల కేంద్రం సంచాలకులుగా ఆయనను జగన్ ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఎల్వీ సుబ్రహ్మణ్యం కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లవచ్చుననే ప్రచారం సాగుతోంది. మరో ఐదు నెలల సర్వీసు ఉన్నఆయనను కేంద్రం తన సేవలకు వినియోగించుకుంటుందనే ప్రచారం సాగుతోంది. ఇది ఒక రకంగా వైఎస్ జగన్ కు మింగుడు పడని విషయమే. కేంద్రం జగన్ ను లక్ష్యం చేసుకోవడానికి ఎల్వీని వాడుకుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ ఎల్వీ సుబ్రహ్మణ్యం శనివారం ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తారని అంటున్నారు. ప్రధానితో ఎల్వీ భేటీ వ్యవహారం కీలకమైన మలుపు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa