భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన నేడు, రేపు ఆహార శిబిరాలు ఏర్పాటు చేయబోతోంది. డొక్కా సీతమ్మ పేరిట నవంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించనుంది. అడ్డాల్లో కార్మికులు చేరే చోటు శిబిరాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం కళ్లు తెరిపించడమే తమ ఉద్దేశ్యమని, భవన నిర్మాణ కార్మికులకు భరోసా కల్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు హైదరాబాద్ జనసేన పార్టీ కార్యాలయంలో శిబిరాల ఏర్పాటుకు సంబంధించి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు పవన్. ఆకలితో ఉన్న వారికి పని కల్పించి కడుపు నింపాల్సిన గవర్నమెంట్..భవన నిర్మాణ కార్మికుల ఉపాధి పొగొట్టి వారి కడుపు మాడ్చేసిందన్నారు. విశాఖలో తాము నిర్వహించిన లాంగ్ మార్చ్ విజయవంతమైందని చెప్పుకొచ్చారు. పస్తులుంటున్న కార్మికుల కోసం చేతనైన సహాయం చేయాలని, జనసేన శ్రేణులు, నాయకులు, ఇతరులు కొంత కృషి చేసి ఆహార సదుపాయాన్ని ఏర్పాటు చేద్దామన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఐదు నెలలుగా వారు ఉపాధి కోల్పోయారని, ఇళ్లు కట్టుకొనే ప్రతి ఒక్కరూ సెస్ కడుతారని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa