ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వలస బాట పట్టిన కార్మికులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 10, 2019, 03:02 PM

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుండి అంబాజీపేట కు సంచార జాతుల కార్మికులు వలస బాట పట్టారు. కమ్మరి వృత్తి చేసుకునే ఈ కార్మికులు ఊరూరా తిరుగుతూ రైతులకు అవసరమయ్యే గునపాలు, పారలు, కత్తులు, కొత్తవి తయారు చేస్తూ,రైతుల వద్ద ఉన్న పాత వాటికి పదును పెడుతూ జీవనం కొనసాగిస్తున్నారు. నేటి సమాజంలో కులవృత్తులు అంతరిస్తున్న నేపథ్యంలో రైతులకు అవసరమయ్యే కత్తులు తదితర వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేయడం వాటికి మరమ్మతులు చేయడం చాలా ఇబ్బందిగా మారింది. వ్యవసాయ పనిముట్ల తయారీనే జీవనాధారంగా చేసుకున్న, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కి చెందిన కైలాస్,తారాబాయ్ దంపతులు,తమ కుటుంబంతో అంబాజీపేట హై స్కూల్ ఎదురుగా ఇనుప పనిముట్లు తయారు చేసే కార్ఖానా ను తాత్కాలికంగా ఏర్పాటు చేసుకొన్నారు.కైలాస్ సోదరుడు దుర్గాప్రసాద్ కూడా వీరి కార్యకలాపాలలో పాలుపంచుకుంటున్నాడు. సాధారణంగా రోజుకు 300 నుండి 500 వరకు మాత్రమే తమకు లభిస్తోందని, ఇది ఏ మాత్రం సరిపోవడం లేదని అయితే రోజు వారిగా లభిస్తున్న మొత్తంలో జీవనం సాగిస్తున్నట్లు వారు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa