ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ విషయంలో బాబు కంటే జగన్ కరెక్ట్ : టిడిపి నేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 10, 2019, 07:20 PM

చంద్రబాబు గంటలు గంటలు చర్చలు ఆపేస్తేనే టీడీపీ బాగుపడుతుందని, చిన్నవాడైనప్పటికీ సీఎంగా జగన్ మోహన్ రెడ్డి సూటిగా, సుత్తి లేకుండా పనిచేసుకుంటూ పోతున్నాడంటూ మాజీ ఎంపీ జేసీ. దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జేసీ దివాకర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు గురించి పలు కామెంట్స్ చేశారు. అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏదైనా సమీక్ష చేస్తే గంటలు గంటలు కాలం తినేస్తాడని, తామేమీ చిన్న పిల్లలం కాదని, అన్ని విషయాలు తెలుసుఅంటూ చురకలు అంటించాడు. అంతేకాదు కొత్త సీఎం జగన్ మోహన్ రెడ్డి చాలా చురుగ్గా పనిచేస్తున్నాడని, ఏదైనా మీటింగ్ అరగంటలో ఫినిష్ చేస్తున్నాడని జేసీ దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు చాదస్తంగా ప్రతీ విషయం క్షుణ్నంగా చెప్పే అలవాటు ఉందని, అది మానుకొని సూటిగా సుత్తి లేకుండా చెప్తేనే జనాలకు, కానీ నాయకులకు కానీ అర్థం అవుతుందని జేసీ చెప్పారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి కుర్చీ వేసుకొని పార్టీలోని సమస్యలను వినాలని, అంతేకానీ చుట్టూ ఉన్న వందిమాగధుల మాటలు వింటే లాభం లేదని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa