ఈ డైలాగ్ నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే, ఆయన వైసీపీలో ఎవ్వరి మాటా లెక్కచేయడం లేదు. వైసీపీ పార్లమెంటరీ లీడర్ విజయసాయిరెడ్డి, వైసీపీ లోక్ సభాపక్ష నేత మిథున్ రెడ్డి, అలాగే పశ్చిమగోదావరి వైసీపీ ఇన్ ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి మాటలను అస్సలు పట్టించుకోవడం లేదట. తనకు జగన్ ఒక్కరే బాస్ అని... జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను మాత్రమే శిరసా వహిస్తానని.... ఇంకెవవ్వరూ చెప్పినా వినే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారట. అంతేకాదు, జగన్ తప్ప.. తనకెవరూ ఆదేశాలు ఇవ్వొద్దంటూ విజయసాయి అండ్ మిథున్ కి తేల్చిచెప్పారట రఘురామకృష్ణంరాజు. అంతేకాదు పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ ఇన్ ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డిపై రఘురామకృష్ణంరాజు గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. తనపై లేనిపోనివి ఎక్కేసి జగన్ కు చెబుతున్నారని వైవీపై రఘురామరాజు మండిపడుతున్నారట. అయితే, వైసీపీ అధిష్టానంపైనా రఘురామకృష్ణంరాజు గుర్రుగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండానే గోకరాజు ఫ్యామిలీని పార్టీలో చేర్చుకున్నారని మండిపడుతున్నారు. గోకరాజు ఫ్యామిలీ ఇంత హడావిడిగా వైసీపీలో చేరడం వెనుక వైవీ సుబ్బారెడ్డి హస్తముందని, అందుకే వైవీ పేరు చెబితేనే రాజు గారు ఫైరవుతున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. అయితే, పార్టీ పెద్దలను ధిక్కరించేంత ధైర్యం రఘురామకృష్ణంరాజుకి ఎక్కడ్నుంచి వచ్చిందని, అసలు ఆయనకున్న ధైర్యమేమిటని చర్చ పార్టీలో నడుస్తోంది.
అయితే, కేవీపీ అండదండలతోనే రఘురామకృష్ణంరాజు స్వతంత్రంగా వ్యహరిస్తున్నారనే మాట వినిపిస్తోంది. రఘురామకృష్ణంరాజు, కేవీపీ వియ్యంకులు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మబంధువైన కేవీపీకి... జగన్ ఫ్యామిలీతో ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయంటున్నారు. జగన్ తో కేవీపీ నేరుగా మాట్లాడకపోయినా... కేవీపీ అండ్ వైఎస్ కుటుంబాలు తరచూ కలుస్తూనే ఉంటాయి. విజయమ్మ, షర్మిల, భారతితోపాటు వైఎస్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది.... కేవీపీ కుటుంబంతో కలిసిమెలిసే ఉన్నారని.... ఇదే రఘురామకృష్ణంరాజు ధైర్యమని చెబుతున్నారు. ఒకవేళ తనపై పార్టీ చర్యలు తీసుకోవాలనుకున్నా కేవీపీ చక్రం తిప్పుతారని, విజయమ్మతో మాట్లాడి తనకేమీ కాకుండా చూస్తారనే నమ్మకంతో రఘురామకృష్ణంరాజు ఉన్నారని అంటున్నారు. అయితే, అలాంటి పరిస్థితే కనుక వస్తే, కేవీపీ కాపాడతారో లేదో తెలియదు గానీ, రఘురామకృష్ణంరాజుకి ప్లాన్ బి కూడా ఉందంటున్నారు.
తన వ్యవహారశైలిపై వైసీపీ అధిష్టానం ఆగ్రహంగా ఉన్నా, తన దారి తనదేనన్నట్టుగా బిహేవ్ చేయడం వెనుక కేవీపీ ఉన్నారనే ధైర్యంతో పాటు మరో స్ట్రాటజీ కూడా ఉందంటున్నారు. బీజేపీ అగ్ర నాయకులతో సత్సంబంధాలున్న రఘురామకృష్ణంరాజుకి... ఆ పార్టీలోకి వెళ్లాలనే ఆలోచన ఉందంటారు. అయితే, తనంతట తాను వెళ్లకుండా, తన చర్యలతో వైసీపీ నుంచి సస్పెండ్ చేయించుకుని బీజేపీలోకి వెళ్లాలన్నది వ్యూహంగా తెలుస్తోంది. రాజు చర్యలను గమనిస్తోన్న వైసీపీ కూడా ఇదే అనుమానాలను వ్యక్తంచేస్తోంది. అందుకే, ఆగమేఘాల మీద గోకరాజు ఫ్యామిలీని పార్టీలో చేర్చుకున్నారని చెబుతున్నారు. అంతేకాదు, రఘురామకృష్ణంరాజుకు ఎలాంటి పనులు, కాంట్రాక్టులూ ఇవ్వొద్దని బీజేపీ పెద్దలకు సైతం వైసీపీ నేతలు చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి రఘురామకృష్ణంరాజు వ్యవహారం వైసీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారిందని అంటున్నారు. మరి రాజు గారు ముందుముందు ఎలాంటి సంచలనాలనకు తెరలేపుతారో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa