అమరావతి బడుగు, బలహీనవర్గాల రాజధాని. ఇన్సైడ్ ట్రేడింగ్ విషయంలో రాజీనామాకు మీరు సిద్ధమా అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి టీడీపీ రాష్ట్ర అధికారప్రతినిధి పంచుమర్తి అనురాధ సవాల్ విసిరారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కావాలని చెప్పి ఒక సామాజిక వర్గానిదని చెప్పి ఈరోజు వైసీపీ నాయకులు విష ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తు వారికి ఇదే మా సమాధానం. ఈ రాజధాని దళిత రాజధాని..ఈ రాజధాని బడుగు, బలహీన వర్గాల రాజధాని. రాజధానికి తూట్లు పెట్టి సినిమా చూసినట్లు చూస్తుంటే కనీసం నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా అటువైపు చూడలేదు.దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారని ఆమె అన్నారు. సామాజిక వర్గం అని మాట్లాడే మీరు వైజాగ్లో ఏ సమాజికవర్గంతో వ్యాపారం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. వైవి సుబ్బారెడ్డి పాట్నర్ ఎవరో మీ మనస్సాక్షికి తెలుసు. వైసీపీ నాయకులు మాట్లాడితే ఇన్సైడ్ ట్రేడింగ్ అంటున్నారు. జూన్ 2వ తేది అమరావతికి రావటం జరిగింది. సెప్టెంబర్ 4 వ తేదిన అమరావతిని రాజధానికి ప్రకటించడం జరిగింది. ఈ నాలుగు నెలల కాలంలో రాజధాని ప్రాంతంలో 125 ఎకరాలు మాత్రమే రిజిస్ట్రేషన్ జరిగాయి. ఎలా ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెబుతారని ప్రశ్నించారు. 4 వేల ఎకరాలు ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎలా చెబుతారు ? నిజంగా ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని మీరు నిరూపిస్తే మేము రాజీనామా చేస్తాం. నిరూపించలేకపోతే మీరు రాజీనామా చేస్తారా? మా ఛాలెంజ్కు మీరు సిద్ధమా అని అడిగారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa