ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అటల్ భూజల్ యోజన’ పథకం ప్రారంభించిన కేంద్రం

national |  Suryaa Desk  | Published : Wed, Dec 25, 2019, 09:39 PM

కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని వాజ్ పేయ్ జయంతిని పురస్కరించుకొని ‘అటల్ భూజల్ యోజన’ అనే పథకాన్ని ప్రారంభించింది. వాజ్ పేయ్ జయంతి సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ … దేశంలో భూగర్భ జలాలను పెంపొందించి..సమర్థవంతంగా వినియోగించకోవడానికి ‘అటల్ భూజల్ యోజన’ అనే పథకాన్ని ఏడు రాష్ట్రాల్లో అమలు చేయబోతునట్లు ప్రకటించారు. ఈ పథకానికి కేంద్రం రూ. 6000 వేల కోట్లను కేటాయించింది. గుజరాత్, హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ పథకం అమలు కానుంది. దాదాపు 8350 గ్రామ పంచాయతీలకు లబ్ధి చేకూరనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa