ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో హిజ్రాల పెన్షన్ ఎత్తివేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2020, 04:48 PM

ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి హిజ్రాలకు పెన్షన్ ఎత్తివేస్తూ సర్కార్ లిస్టు జారీ చేసింది. ప్రస్తుతం ప్రతి నెల హిజ్రాలకు నెలకు 1500 రూపాయల పెన్షన్ అందజేస్తున్నారు. ఇక నుంచి హిజ్రాలకు పెన్షన్ ఇవ్వకూడదని సర్కార్ నిర్ణయించింది.


2017 డిసెంబర్ 16న జరిగిన అప్పటి ప్రభుత్వ కేబినేట్ భేటిలో హిజ్రాలకు ప్రతి నెల 1500 రూాపాయలు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు హిజ్రాలకు పెన్షన్ అందజేస్తున్నారు. కానీ అనూహ్యంగా జగన్ సర్కార్ హిజ్రాలకు పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa