కార్యాలయాలకు ప్రభుత్వ రంగులపై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా గ్రామ పంచాయతీలకు వైకాపా జెండా రంగులు వేయించిందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ భవనాలకు రంగులు వేసే అధికారం వారికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రభుత్వానికి హైకోర్టు మెుట్టికాయలు వేసిందని గుర్తుచేశారు. రంగులు చెరిపేందుకు అయ్యే ఖర్చును ముఖ్యమంత్రి జగన్ నుంచే వసూలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యలను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa