ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 30, 2020, 04:34 PM

శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లుతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు ఆగడం లేదు. సెలెక్ట్ కమిటీకి పార్టీల వారీగా సభ్యుల జాబితాను పంపాల్సిందిగా మండలి చైర్మన్ షరీఫ్ ఇటీవలే అదేశాలిచ్చారు. అయితే చైర్మన్ అదేశాలు ఇచ్చినా కూడ అసెంబ్లీ సెక్రటరీ రాజకీయ పార్టీలకు లేఖలు పంపడంలో కావాలనే ఆలస్యం చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత యనమల మండిపడ్డారు. సెక్రటరీపై వైసీపీ నేతల ఓత్తిడితోనే ఇలా జరుగుతుందని యనమల ఆరోపించారు.


అసెంబ్లీ సెక్రటరీపై తాము ఓత్తిడి చేయాల్సిన అవసరం లేదని మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు. అధికారులు ఎవరైనా నిబంధనలకు అనుగుణంగా పని చేస్తారని బొత్స అన్నారు. శాసనమండలి చైర్మన్ నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టే అధికారులు రాజకీయ పార్టీలకు లేఖలు పింపించడం లేదని బొత్స క్లారిటీ ఇచ్చారు. చైర్మన్ ఆదేశలను అమలు చేస్తే బలైయ్యేది అధికారులేనన్న విషయం గుర్తు పెట్టుకోవాలని బొత్స సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa