కేరళను నైరుతి రుతుపవనాలు తాకాయి. దీంతో ఏపీలో వాతావరణం కాస్త చల్లబడింది. అక్కడక్కడ వర్షాలు కూడా కురస్తున్నాయి. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అదే విధంగా నాలుగు జిల్లాలలో పిడుగు పడే ప్రమాదముందని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు, చంద్రశేఖరపాలెం మండలాల్లో పిడుగు పడే ప్రమాదముందన్నారు. గుంటూరు జిల్లా అమరావతి,పెదకురుపాడు,తాడికొండ,అచంపేట్, క్రోసూరు, చందర్లపాడు మండలాల్లో పిడుగు పడే ప్రమాదముందన్నారు. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు, తర్లుపాడు మండలాల్లో పిడుగు పడే ప్రమాదముందన్నారు. కడప జిల్లా పెండ్లిమర్రి, వీరపునాయునిపల్లె, కలసపాడు, వేంపల్లె, యర్రగుంట్ల, కమలాపురం మండలాల్లో పిడుగు పడే ప్రమాదముందన్నారు. పొలాల్లో పని చేసేవారు,కూలీలు జాగ్రత్తగా ఉండాలని చెట్ల కింద, ఆరు బయట ఉండొద్దని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa