ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా తాజాగా నమోదవుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఒకరి వల్ల 157 మందికి కరోనా సోకడం కలకలం రేపుతోంది. పెదపూడి మండలం గొల్లల మామిడాడతో పాటూ చుట్టు పక్కల వైరస్ పంజా విసురుతోంది. జి.మామిడాడలో తొలి పాజిటివ్ కేసు కాకినాడ జీజీహెచ్లో ఈనెల 21న చనిపోవడంతో అలజడి మొదలైంది. అలా మొదలైన వ్యాప్తి చుట్టు పక్కల మండలాలకు విస్తరించింది. తూ.గో జిల్లాలో మొత్తం 303 కేసులు ఉంటే ఒక్కరి వల్లే ఇప్పటివరకు ఇప్పటివరకు 157 కేసులు నమోదయ్యాయి. ఆ గ్రామంలోనే ఈ సూపర్ స్ప్రెడర్ దెబ్బకు 117 మందికి వైరస్ అని తేలింది. దీంతో జిల్లా కలెక్టర్తో పాటూ అధికారులు అప్రమత్తమయ్యారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసి ఆ ప్రాంతంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేసుల సంఖ్య పెరగడంతో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. రాష్ట్రంలో ఒక వ్యక్తి ద్వారా ఎక్కువ మందికి వైరస్ వ్యాపించడం ఇదే మొదటిసారి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa