ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్షణికావేశంలో పిల్లలతో పాటు ఆత్మహత్యకు పాల్పడ్డ ఓ మహిళా...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 05, 2020, 12:53 PM

ఓ వివాహిత తన భర్తతో గొడవపడి క్షణికావేశంలో తన పిల్లలతో సహా కాల్వలోకి దూకింది. కానీ పిల్లలు తప్పించుకోవడంతో ఆ వివాహిత నీటిలో మునిగి మరణించింది. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామానికి చెందిన రాచమళ్ల స్వరూపరాణి(32), శ్రీనివాసరావులకు 14 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. వారికి అభిషేక్(13), కీర్తన(12) పిల్లలు ఉన్నారు. అయితే ఇటీవల భార్యభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపం చెందిన స్వరూపరాణి తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి బయలుదేరింది. మధ్యాహ్నాం ఒంటి గంట వరకు విజయవాడ బస్టాండుకు చేరింది.


అక్కడ్నుంచి దుర్గాఘాట్, ప్రకాశం బ్యారేజీ తదితర ప్రాంతాల్లో తిరిగి సాయంత్రానికి పిల్లలిద్దరితో కలిసి విజయవాడ నగరపాలక సంస్థ సమీపంలోని బందరు కాలువ వద్దకు వచ్చింది. గురువారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో పిల్లలిద్దరినీ బలవంతంగా కాలువలోకి లాక్కెళ్లి చేతులతో వారిని నీటిలోకి ముంచి తాను కూడా నీటిలో మునిగింది. కాల్వలో నీటి మట్టం నాలుగు అడుగులకు మించి లేకపోవడం.. ప్రవాహ వేగం లేకపోవడంతో పిల్లలిద్దరూ తల్లి చేతి నుంచి తప్పించుకుని ఏలాగోలా ఒడ్డుకు చేరుకున్నారు.


స్వరూపరాణి మాత్రం నీటిలో మునిగి ప్రాణాలు వదిలింది. కుమార్తె కీర్తన పైకి వచ్చి సమీపంలోని స్థానికులకు విషయం చెప్పింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి చేరుకుని స్వరూపరాణి మృతదేహాన్ని వెలికితీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa