ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దొంగతనం నెపంతో మైనర్ కు కరెంట్ షాక్

national |  Suryaa Desk  | Published : Tue, Jun 16, 2020, 05:53 PM

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దొంగతనం అనుమానంతో ఓ వ్యక్తి ఉన్మాదిలా వ్యవహరించాడు. ఓ కుటుంబం మొత్తాన్ని చిత్ర హింసలు పెట్టి నరకం చూపించాడు. సిగరెట్ తో ఒళ్లంతా కాల్చాడు. ముఖమంతా గిచ్చాడు. కరెంట్ షాక్ కూడా ఇచ్చాడు. అంతేకాదు ఆ కుటుంబాన్ని ఓ చిన్న రూమ్ లో సుమారు 36 గంటల పాటు నిర్బంధించాడు. వారికి కనీసం తాగు నీరు కూడా ఇవ్వలేదు. ఈ దాడిలో 12 ఏళ్ల మైనర్ బాలుడికి ఒళ్లంతా తీవ్ర గాయాలయ్యాయి. అతడు స్పృహ కోల్పోయాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నొప్పులు, భయంతో వణికిపోతున్నాడు. పిల్లాడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. వివరాల ప్రకారం.. అబ్రార్ అనే వ్యక్తి ఇంట్లో బంగారు గొలుసు చోరీకి గురైంది. దీంతో అతడు బాలుడు అమీర్ పై అనుమానపడ్డాడు. అమీర్ ను అతని ఇంటికి తీసుకెళ్లి దొంగిలించిన బంగారు గొలుసు ఎక్కడ దాచాడో చెప్పాలని తీవ్రంగా కొట్టాడు. అనంతరం అమీర్ తండ్రి, తల్లి, అన్నను సైతం ఇంటికి తీసుకెళ్లి చిత్రరహింసలు పెట్టాడు. ఒక రూంలో బంధించి చిత్ర హింసలకు గురి చేశాడు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న బాధితుల బంధువు అయిన ఒక మహిళనకు కూడా బంధించి చిత్ర హింసలు పెట్టారు. అందులోని ఒకరు తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు కూడా నిందితుల వైపే నిలిచారు. రూ.50వేలు డబ్బు తీసుకుని నిందితులను వదిలేశారు. బాధితులకు కనీసం వైద్య సాయం కూడా అందించలేదు. స్థానికంగా సంచలనంగా మారిన ఈ విషయం జిల్లా ఎస్పీ వరకు వెళ్లింది. ఎట్టకేలకు ఎస్పీ ఆదేశాలతో కదిలిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa