ప్రధాన మంత్రి వయ వందన యోజన-PMVVY పథకం గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. మార్చి 31న ముగిసిన స్కీమ్ గడువును మరో మూడేళ్లు పొడిగిస్తూ కేంద్ర మంత్రి వర్గం కొద్ది రోజుల క్రితం ఆమోద ముద్ర వేసింది. అంటే ఈ స్కీంలో చేరాలనుకునే వారికి 2023 మార్చి 31 వరకు అవకాశం ఉంది. వృద్ధాప్యంలో పెన్షన్ ద్వారా అసరా పొందాలనుకునే వృద్ధుల కోసం కేంద్ర ప్రభుత్వం 2017లో ఈ స్కీమ్ ను ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న పొదుపు పథకాలతో పోలిస్తే ప్రధాన మంత్రి వయ వందన యోజన స్కీమ్లో ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ఈ స్కీమ్లో 2020-21 ఆర్థిక సంవత్సరానికి 7.4 శాతం వడ్డీని కేంద్రం ప్రకటించింది. కేంద్రం ప్రతీ ఏడాది వడ్డీని నిర్ణయిస్తుంది. భారత ప్రభుత్వానికి చెందిన ఎల్ఐసీ ఈ స్కీమ్ను మేనేజ్ చేస్తోంది. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఈ స్కీమ్ తీసుకోవచ్చు.ఈ పాలసీ తీసుకోవాలంటే ఆధార్ నెంబర్ తప్పనిసరి. ఈ స్కీమ్ ద్వారా నెలనెలా పెన్షన్ పొందేందుకు ముందుగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ స్కీమ్లో పెట్టిన పెట్టుబడిని బట్టి నెలకు రూ. వేయి నుంచి రూ.10,000 వరకు పెన్షన్ పొందొచ్చు. నెలకు రూ.10,000 పెన్షన్ కావాలనుకుంటే రూ.15,66,580 పెట్టుబడి పెట్టాలి. ఇన్వెస్ట్ చేసిన నాటి నుంచి 10 ఏళ్ల వరకు పెన్షన్ లభిస్తుంది. 10 ఏళ్లు పూర్తైన తర్వాత పెట్టుబడి మొత్తం తిరిగివస్తుంది. ప్రధాన మంత్రి వయ వందన యోజన స్కీమ్లో చేరడానికి కనీస వయస్సు 60 ఏళ్లు కాగా గరిష్ట పరిమితి లేదు. పాలసీ గడువు 10 ఏళ్లు.ఈ స్కీమ్లో చేరిన వారికి నెలకు రూ. వేయి, మూడు నెలలకు రూ. 3 వేలు, ఆరు నెలలకు రూ.6 వేలు, ఏడాదికి రూ.12 వేలు కనీస పెన్షన్ లభిస్తుంది. గరిష్ట పెన్షన్ వివరాలు చూస్తే నెలకు రూ.10 వేలు, మూడు నెలలకు రూ.30 వేలు, ఆరు నెలలకు రూ.60 వేలు, ఏడాదికి రూ.1,20,000 చొప్పున పొందొచ్చు. ఏడాదికి రూ.12,000 పెన్షన్ పొందాలనుకుంటే రూ.1,56,658 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. నెలకు రూ.1,20,000 పెన్షన్ కావాలంటే రూ.15,66,580 ఇన్వెస్ట్ చేయాలి. పాలసీ మూడేళ్లు పూర్తైన తర్వాత గరిష్టంగా 75% వరకు రుణం తీసుకోవచ్చు. వడ్డీ ఏడాదికి 10% చెల్లించాల్సి ఉంటుంది. ప్రధాన మంత్రి వయ వందన యోజన స్కీంకు ఫ్రీ లుక్ పీరియడ్ కూడా ఉంది. అంటే పాలసీ నచ్చకపోతే తీసుకున్న 15 రోజుల్లో వెనక్కి ఇవ్వవచ్చు. ఆన్లైన్లో తీసుకుంటే 30 రోజుల ఫ్రీ లుక్ పీరియడ్ ఉంటుంది.ప్రీమెచ్యూర్ ఎగ్జిట్ సదుపాయం కూడా ఉంది. 10 ఏళ్ల గడువు పూర్తికాక ముందే పాలసీ వద్దనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 98% మాత్రమే వెనక్కి వస్తుంది. ఉదాహరణకు 60 ఏళ్ల వయస్సుగల వ్యక్తి 2020 సంవత్సరంలో ఈ స్కీమ్లో రూ.15,66,580 పెట్టుబడి పెడితే ఏడాదికి రూ.1,20,000 చొప్పున 10 ఏళ్ల పాటు పెన్షన్ వస్తుంది. 10 ఏళ్లు పూర్తైన తర్వాత పెట్టుబడి వెనక్కి వస్తుంది. ఒకవేళ పది ఏళ్లు పూర్తికాక ముందే పెట్టుబడి పెట్టిన వ్యక్తి చనిపోతే పెట్టుబడి మొత్తం వారి జీవితభాగస్వామి లేదా పిల్లలు లేదా నామినీకి చెందుతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa