తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికెళ్లినా కనిపించే దోసె, ఇక్కడ ఉద్భవించలేదని మీకు తెలుసా?
చరిత్రకారుడు పి. థానపాన్ నాయర్ తెలిపినదాని ప్రకారం, దోస యొక్క మూలం ఉడిపితో ముడిపడి ఉంది. అందుకు కారణం బహుశా ఉడిపి రెస్టారెంట్లలోని పదార్థాలు దోసకు అనుబంధంగా ఉండటమే. . ఆహార చరిత్రకారుడు కె.టి. ఆచయ తెలిపిన దాని ప్రకారం, ప్రాచీన తమిళ దేశంలో దోసె వంటిది 1వ శతాబ్దం ఎ.డి. నాటికే వినియోగంలో ఉంది.
ఇలా కర్ణాటకలో ఉద్భవించిన దోసె దక్షిణ భారతదేశంలో విస్తరించి బాగా ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇష్టమైనదిగా నిలిచింది.
దక్షిణ భారతదేశానికి చెందిన వంటకం ఉత్తర ప్రాంతంలో క్రమంగా విస్తరించి ప్రజాదరణ పొందింది. ఢిల్లీలో కన్నాట్ ప్లేస్ లోని మద్రాస్ హోటల్ దక్షిణ భారత వంటకాల్లో మొదటి రెస్టారెంట్ అనే పేరు గాంచింది. దోసె 1930 సం.ల్లో ఉడిపి రెస్టారెంట్లతో ముంబైకి వచ్చింది.
దక్షిణ భారతీయులకు అత్యంత ఇష్టమైన అల్పాహారాల్లో దోసెది ప్రథమ స్థానం. దీనిని దోశ, దోసై, అట్టు అని కూడా పిలుస్తారు.
సాధారణంగా కర్ణాటకలో దోసెలను చట్నీ, సాంబార్ వేసి వడ్డిస్తారు. తమిళనాడులో కారంపొడి, సాంబార్ వడ్డిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో పెసరట్టు అల్లంచట్నీతో తినడం ఆనవాయితీ. దోసెలతో సహా పచ్చడి, కూర కూడా ఇస్తుంటారు.
అట్లతద్దె పండుగ తెలుగు రాష్ట్రాల్లోని అమ్మాయిలకు ఎంతో ఇష్టం. అట్ల కొరకు నోములు కూడా చేస్తారు. కన్నెపిల్లలు మంచి భర్త రావాలని కోరుతూ ఈ నోము చేస్తారు.
దోసె ఏవిధమైన చక్కెరలు లేదా సంతృప్త కొవ్వులు ఉండకుండా కేవలం కార్బోహైడ్రేట్లను అధికంగా కలిగి ఉంటుంది. ప్రొటీన్కు మంచి మూలపదార్థమయిన మినుము, బియ్యంతో ఇది తయారవుతుంది. సెట్ దోశ, బెన్నే దోసె, నీరు దోసె కర్ణాటకలో బాగా ఫేమస్. మసాలా దోసె, పెసర దోసె, ఉల్లి దోసె తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రసిద్ధి చెందాయి. మేతి దోసె తమిళనాడులో బాగా ఫేమస్. కేరళ దోసెను మలయాళీలు అమితంగా ఇష్టపడతారు.
మరి ఈ రకరకాల దోశల్లో మీకు ఇష్టమైన దోశ ఏంటి? వీడియో క్రింద కామెంట్ చేసి మాకు తెలపండి. దోశ ఎలా ఉద్బవించిందో మీరు బంధుమిత్రులతో షేర్ చేసి వారికీ తెలియచేయండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa