భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే మదన్ మోహన్ దత్తా ఒడిశాలోని భువనేశ్వర్లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారంనాడు ఆయన తుదిశ్వాస విడిచారు. దత్తా మృతి పట్ల ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేసారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
బాలాసోర్ సదర్ నియోజవకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేసిన మదన్ మోహన్ దత్తా బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే జిబన్ ప్రదీప్ దేశ్పై గెలుపొందారు. కాగా, దత్తా మృతి పట్ల కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దత్తా తనకు సోదరుడు వంటివాడని అన్నారు. ముక్కుసూటి తత్వం, ప్రజాసేవ పట్ల అంకింతభావం కలిగిన నేత అని గుర్తు చేసుకున్నారు. ఒడిశా పీసీసీ అధ్యక్షుడు నిరంజర్ పట్నాయక్ సైతం ఓ ట్వీట్లో దత్తా మృతికి సంతాపం తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa