ఉత్తరప్రదేశ్ లోని ఓ పెళ్లి ఇంట దారుణం చోటు చేసుకుంది. భోజనం దగ్గర జరిగిన గొడవ పెళ్లి ఇంట రక్తం పారేలా చేసింది. స్వీట్ల విషయంలో మొదలైన గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో రక్తపాతం జరిగింది. వధువు సోదరుడిని హత్య చేయడమే గాక, తన ఎస్యూవీ కారుతో ఇద్దరు మహిళలు మరియు ఒక టీనేజ్ బాలికను కూడా తొక్కించాడు వరుడు.
సోమవారం సాయంత్రం ఫరూఖాబాద్లోని అట్సైని పహర్పూర్ గ్రామానికి చెందిన 26 ఏళ్ల యువకుడు మనోజ్ కుమార్కు గోవింద్పూర్ అదుల్లాపూర్కు చెందిన యువతికి వివాహం జరిగింది. పెళ్లి అనంతరం రాత్రి బరాత్ కార్యక్రమం నిర్వహించారు. అయితే అప్పటికే పీకల దాకా తాగి ఉన్న వరుడు, అతడి స్నేహితులు పెళ్లి భోజనాలు సరిగా లేవంటూ వధువు తరపు బంధువులతో గొడవకు దిగారు. ఏ సమయంలో ఓమారు కాల్పులు కూడా జరపగా పెళ్లి కూతురి బంధువు తృటిలో తప్పించుకున్నారు.వరుడు వాళ్ళకి నీళ్లు సర్వ్ చేస్తున్నవధువు సోదరుడు 9ఏళ్ళ ప్రన్షుని కూడా కొట్టి బలవంతంగా కారులో తీసుకెళ్లిపోయారు. ఈ క్రమంలో ఎదుట ఉన్న మనుషులను పట్టించుకోకుండా వారిపైనే కారుపోనివ్వడంతో ఇద్దరు మహిళలకు,ఓ బాలికకు తీవ్ర గాయాలయ్యాయి.గాయపడిన వారిని విమ్లా(50), మిథిలేష్(35) సప్నా(17)గా గుర్తించారు . వెంటనే వారిని లోహియా జిల్లా ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం వారి వరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
తీసుకెళ్లిన తన తమ్ముడిని తీసుకుని తిరిగి వచ్చేయమంటూ పెళ్లి కొడుకు మనోజ్ కుమార్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లాభం లేకపోయింది. తర్వాతి రోజు ఉదయం మూడు గంటలకు నా తమ్ముడి శవాన్ని పంపించారు. అతని గొంతు పిసికి చంపినట్లుగా మెడపై ఆధారాలు ఉండటమే కాక ముఖం గుర్తు పట్టరాకుండా ఉందని వధువు పెద్ద అన్న పునీత్ కన్నీరుమున్నీరయ్యాడు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలుడి శవాన్ని పోస్ట్మార్టమ్కు తరలించారు. నిందితుడైన వరుడు, అతని బంధువుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa