కరోనా వైరస్ ప్రళయం సృష్టిస్తున్న వేళ ఉద్యోగులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రైవేట్ కంపెనీలు అయితే ఉద్యోగులను సైతం తొలగించారు. ఇలాంటి తరుణంలో ఓ కంపెనీ వ్యవస్థాపకుడు తన కంపెనీలోని ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. తన కంపెనీలో చేరిన తొలి 50 మంది ఉద్యోగులకు 60లక్షల కంపెనీ షేర్లను కట్టబెట్టనున్నట్లు ప్రకటించారు. అమెరికాలోని స్టార్టప్ కంపెనీ నికోలా వ్యవస్థాపకుడు చైర్మన్, ట్రెవర్ మిల్టన్ తన కంపెనీలో ఉద్యోగుల పట్ల ఇలా ఔదార్యం చూపించారు.తన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ స్టార్టప్ కంపెనీలో ముందుగా చేరిన 50 మంది ఉద్యోగులకు తాను చేసిన వాగ్ధానం ప్రకారం 60లక్షల కంపెనీ షేర్లను వారికి కట్టబెట్టనున్నట్లు ప్రకటించారు. అంటే అక్షరాల రూ.1721.32 కోట్లు విలువైన షేర్లు కట్టబెట్టనున్నారు. ఈషేర్లు ద్వారా ఒక్కో ఉద్యోగికి 34.5 కోట్ల విలువైన షేర్లతో కంపెనీలో చోటు దక్కనుంది. ఈ సందర్భంగా ట్రైవర్ మిల్టన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కంపెనీని ప్రారంభించినప్పుడు ప్రపంచంలోనే మెరుగైన ఉద్యోగులను తీసుకోవాలనుకున్నానని..అది తనకు పెనుసవాల్గా మారిందని ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేసిన వీడియోలో తెలిపారు.అదృష్టవశాత్తూ తనకు తొలి రోజు నుంచే అసాధారణమైన ఉద్యోగుల బృందం లభించిందని చెప్పుకొచ్చారు. వారు ఉద్యోగంలో చేరే సమయంలో ఇచ్చిన హామీ మేరకు నా వ్యక్తిగత షేర్ల నుంచి 60లక్షలషేర్లను వారికి అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల సంస్థలో తన వాటా తగ్గుతుందని అయినప్పటికీ వాటిని విక్రయించకుండా ఉద్యోగులకు ఇస్తున్నట్లు తెలిపారు. మనం మరింతగా పని చేస్తే భవిష్యత్తులో ఇది బిలియన్లకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇక కంపెనీ విషయానికి వస్తే జూన్లో రివర్స్ మెర్జర్ ద్వారా నాస్డాక్లో నికోలా ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి షేర్ విలువ భారీగా పెరిగింది. హైస్కూల్ విద్యను కూడా దాటని 37 మిల్టన్ పట్టుదలతో వాణిజ్యవేత్తగా ఎదిగారు. తన సంస్థ ఉన్నతికి సోషల్ మీడియాను సమర్ధవంతంగా వాడుకున్న మిల్టన్ను ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఐదవ వ్యక్తిగా నిలిచారు. 460 కోట్ల డాలర్ల సంపదతో బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్లో ప్రపంచంలో 500 మంది సంపన్నుల్లో చోటు దక్కించుకున్నారు.అయితే ఉద్యోగులకు షేర్ల బదిలీ జరిగితే ఈ జాబితాలో ఆయన ర్యాంక్ పతనమయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ట్రైవర్ మిల్టన్ నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతుంది. ఉద్యోగులతో పనిచేయించుకోవడమే కాదు.. జీతాలు ఇచ్చే సంస్థలు చాలా ఉన్నా వారి బాగోగులను పట్టించుకునే యజమానులు అరుదుగా కనిపిస్తారు. నికోలా కార్పొరేషన్ అధినేత ట్రెవర్ మిల్టన్ తీసుకున్న నిర్ణయం ఉద్యోగులపై ఆయనకున్న అభిమానం, విశ్వాసాన్ని వెల్లడించాయంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa