ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 29, 2020, 12:50 PM

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బోలేరో వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. పలాస మండలం నెమలి నారాయణపురం వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా, మరో 9మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వలస కూలీలు జార్ఖండ్ నుంచి విశాఖ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు క్షతగాత్రుల్ని హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa