జెరుసలెం: తొమ్మిదేళ్ల క్రితం ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో బేబీ మోషే తన పేరెంట్స్ను కోల్పోయాడు. 2008 నవంబర్ 28న జరిగిన ఉగ్రదాడిలో చిన్నారి మోషే తల్లితండ్రులు ఉగ్ర తూటాలకు బలయ్యారు. నారీమన్ దగ్గర ఉన్న యూదు సెంటర్లో జరిగిన దాడిలో మోషే పేరెంట్స్ మృత్యువాతపడ్డారు. అప్పుడు మోషే వయసు రెండేళ్లు. ఇప్పుడు అతనికి పదేళ్లు నిండాయి. ఇజ్రాయల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఇవాళ అక్కడ మోషేను కలుసుకోనున్నారు. ఉగ్రవాదులు దాడి జరిపినప్పుడు మోషే పేరెంట్స్ దగ్గర పనిమనిషిగా చేస్తున్న సాండ్రా సామ్యూల్ అనే మహిళ ఆ చిన్నారిని ప్రాణాలకు తెగించి కాపాడింది. ఆ తర్వాత మోషేను ఆ పిల్లవాడి గ్రాండ్ పేరెంట్స్ దగ్గరకు తీసుకెళ్లింది. ఇప్పుడు పనిమనిషి సాండ్రాతో పాటు పదేళ్ల మోషే కూడా ఇజ్రాయల్లోనే ఉంటున్నారు. అయితే ప్రధాని మోదీ తమ మనవడిని కలిసేందుకు వస్తున్నారని తెలుసుకుని ఆ అబ్బాయి గ్రాండ్ పేరెంట్స్ సంతోషం వ్యక్తం చేశారు. పిల్లవాడు పెద్దవాడయ్యాక మళ్లీ ఇండియా వెళ్తాడన్న ఆశాభావాన్ని కూడా వాళ్లు వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa