ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్సార్ భరోసా కింద రైతులను ఆదుకుంటాం: జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 09, 2017, 04:29 PM

తాము అధికారంలోకి రాగానే వైఎస్సార్ భరోసా కింద రైతులను ఆదుకుంటామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులు అందరికీ రూ.50 వేలు ఇస్తామని, ఈ మొత్తాన్నిప్రతి ఏటా నాలుగు విడతల్లో రూ. 12,500  మే నెలలో యిస్తామని చెప్పారు. ఈ మొత్తాన్నినేరుగా రైతుల చేతికే యిస్తామని, ఏ పంట వేయాలన్నది వారికే వదిలేస్తామని చెప్పారు. వైఎస్సార్ భరోసా కింద ప్రతి రైతుకు ఈ సాయం అందజేస్తామని, కుల,మత, ప్రాంత, వర్గ, రాజకీయాలకు అతీతంగా ఈ సాయం అందిస్తామని చెప్పారు. దీని ద్వారా 86 శాతం మంది రైతులు అంటే 66 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుందని, మొత్తం రూ.33 వేల కోట్లు ప్రభుత్వం తరపున చెల్లించేలా చేస్తామని, రైతును మళ్లీ స్వర్ణయుగంలోకి తీసుకెళ్తామని జగన్ హామీ ఇచ్చారు.మని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధరలకు కల్పిస్తామని, రూ.2 వేల కోట్లతో కెలమిటీ ఫండ్ ఇస్తామని, రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, డ్వాక్రా, పొదుపు సంఘలకు ‘వైఎస్సార్ ఆసరా’ అనే పథకాన్ని తీసుకొస్తామని, సున్న వడ్డీకు రుణాలిస్తామంటూ జగన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa