ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 10, 2017, 08:47 AM

తిరుమల: తిరుమల ఏడుకొండలవాడి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. వేంకటేశ్వరుడి దర్శనానికి భక్తులు 28 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీనివాసుడి సర్వదర్శనానికి 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. నడకమార్గం ద్వారా వచ్చిన భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. నడకమార్గం ద్వారా వచ్చిన భక్తులకు శుక్ర, శని, ఆది వారం రోజుల్లో దివ్యదర్శనం టోకెట్లు ఇవ్వడం జులై 7 తేదీ నుంచి నిలిపివేశారు. లడ్డూల టోకెన్లు మాత్రం ఇస్తున్నారు. సోమ, మంగళ, బుధ, గురు వారాల్లో నడక మార్గంలో వచ్చిన భక్తులకు దివ్యదర్శనం టోకెట్లు, లడ్డూ టోకెట్లు జారీ చేస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa