ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 337 పరుగులకు ఆలౌటైంది. 6 వికెట్లకు 257 పరుగులతో నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా జట్టు మరో 80 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (85 నాటౌట్) అద్భుత పోరాటంతో టీమిండియా ఈ మాత్రం స్కోరైనా సాధించింది. అశ్విన్ (31) అవుటైన తర్వాత బ్యాటింగ్ వచ్చిన బ్యాట్స్ మెన్స్ పెవిలియన్ బాట పట్టారు. దీంతో సుందర్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఇకపోతే తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 241 పరుగులు వెనుకబడి ఉంది. అయితే ఇంగ్లండ్ మాత్రం టీమిండియాను ఫాలోఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్ ఆడాలని నిర్ణయించుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa